వాళ్ల ఆధారమంతా దానిపైనే

తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలకు ఒక అజెండా లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు విపక్షాలకు లేదని [more]

Update: 2021-04-13 01:34 GMT

తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలకు ఒక అజెండా లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి పేర్ని నాని అన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు విపక్షాలకు లేదని పేర్నినాని చెప్పారు. తాము ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని అమలుపర్చామని పేర్నినాని పేర్కొన్నారు. తాము ఏం చేశామో ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నామని పేర్ని నాని తెలిపారు. చంద్రబాబు, నారా లోకేష్ ల నాలుకకు నరం లేదని చెప్పారు. కేవలం విష ప్రచారంపైనే టీడీపీ, బీజేపీ లు ఆధారపడ్డాయని పేర్ని నాని చెప్పారు.

Tags:    

Similar News