బ్రేకింగ్ : పవన్ కు ఢిల్లీ నుంచి ఫోన్ రాగానే?

పార్టీ నేతలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతోనే పవన్ కల్యాణ్ హడావిడిగా ఢిల్లీ వెళ్లినట్లు [more]

Update: 2020-01-11 07:51 GMT

పార్టీ నేతలతో సమావేశమైన జనసేన అధినేత పవన్ కల్యాణ‌్ హుటాహుటిన ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతోనే పవన్ కల్యాణ్ హడావిడిగా ఢిల్లీ వెళ్లినట్లు తెలిసింది. రాజధాని అంశం, స్థానిక సంస్థల ఎన్నికల విషయంపై పార్టీ నేతలతో పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం సమావేశమయ్యారు. పదమూడు జిల్లాలకు చెందిన జనసేన నేతల అభిప్రాయాలను పవన్ కల్యాణ్ తెలుసుకున్నారు. రాజధాని రైతులకు అండగా నిలబడాలని అనేక మంది నేతలు అభిప్రాయపడ్డారు. రెండురోజుల్లోనే విజయవాడలో రైతులకు మద్దతుగా కవాతు నిర్వహించాలని పవన్ కల్యాణ్ భావిస్తున్న తరుణంలో ఢిల్లీ నుంచి ఫోన్ రావడంతో బయలుదేరి వెళ్లారు. ఢిల్లీకి వెళ్లిన పవన్ కల్యాణ్ కేంద్ర మంత్రులను, కీలక నేతలను కలిసే అవకాశముందని చెబుతున్నారు. పవన్ కు బీజేపీ నేతల అపాయింట్ మెంట్ లభించినట్లు చెబుతున్నారు.

Tags:    

Similar News