పవన్ నేడు చెబుతారట

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిపై కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు [more]

Update: 2020-01-11 04:03 GMT

జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశం మరికాసేపట్లో జరగనుంది. ఈ సమావేశంలో పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిపై కార్యాచరణను ప్రకటించనున్నారు. ఇప్పటికే పవన్ కల్యాణ్ రాజధాని రైతులకు మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజధాని అమరావతి కోసం జేఏసీ నిర్వహిస్తున్న ఆందోళనల్లో జనసేన పాల్గొంటుంది. అయితే రైతులకు ఎలా అండగా నిలబడాలన్న దానిపై పవన్ కల్యాణ్ ఈరోజు స్పష్టత ఇవ్వనున్నారు. రాజధాని రైతులకు మద్దతుగా విజయవాడలో కవాతు నిర్వహించాలన్నది ఒక ప్రతిపాదన కాగా, రైతు ప్రతినిధులతో ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలను కలవాలన్న ఆలోచనలో పవన్ కల్యాణ్ ఉన్నారు.

Tags:    

Similar News