పులివెందులే బెటరేమో?

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని పులివెందులకు మార్చుకుంటే బెటరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్ [more]

Update: 2019-11-05 10:33 GMT

వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాజధానిని పులివెందులకు మార్చుకుంటే బెటరని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లా నేతలతో సమీక్ష నిర్వహించిన పవన్ కల్యాణ్ కోర్టును కూడా కర్నూలుకు మారిస్తే జగన్ పులివెందుల నుంచి ప్రతి శుక్రవారం వెళ్లేందుకు సులువుగా ఉంటుందన్నారు. ఖర్చు కూడా తగ్గుతుందన్నారు. వైసీపీ ప్రభుత్వం అన్ని రకాలుగా వైఫల్యం చెందిందన్నారు. ఇసుక కొరత సమస్యను తీర్చకుంటే త్వరలోనే తాను ప్రత్యక్ష ఆందోళనకు దిగుతానని పవన్ కల్యాణ‌్ మరోసారి హెచ్చరించారు.

Tags:    

Similar News