జగన్ పై వపన్ హార్ష్ కామెంట్స్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సీబీఐ కేసుల భయం పట్టుకుందని, అందుకని ఢిల్లీ వెళ్లి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సీబీఐ కేసుల భయం పట్టుకుందని, అందుకని ఢిల్లీ వెళ్లి [more]
ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సీబీఐ కేసుల భయం పట్టుకుందని, అందుకని ఢిల్లీ వెళ్లి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడుతున్నారన్నారు. ఢిల్లీ వెళ్లి మంత్రుల దగ్గర గట్టిగా జగన్ మాట్లాడలేకపోతున్నారన్నారు. వైఎస్ వివేకా హత్య జరిగి ఇన్ని రోజులవుతున్నా జగన్ ఏమీ తేల్చలేకపోయారని, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. పవన్ కల్యాణ్ ఈరోజు ప్రకాశం జిల్లా నేతలతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.