సీఎం పదవి కోరుకునే వారికి చిత్తశుద్ధి ఉండదు

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మళ్లీ సీఎం [more]

Update: 2019-01-10 10:29 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కుటుంబాల చేతుల్లో నలిగిపోతున్నాయని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. గురువారం ఆయన విజయవాడలో మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ మళ్లీ సీఎం చేయండి అంటుంటే, వైసీపీ ఒకసారి సీఎం చేయండి అంటున్నాయని, సీఎం పదవి కోరుకునే నాయకులకు చిత్తశుద్ధి ఉండదని పేర్కొన్నారు. 2014లో తాను కొన్ని స్థానాల్లో పోటీ చేయాలనుకున్నానని, కానీ కొన్ని చోట్లే పోటీ చేస్తే పార్టీ బలోపేతం కాదని ఆగిపోయానని పేర్కొన్నారు. అప్పుడు తాను మద్దతు ఇచ్చినందున టీడీపీ, బీజేపీలు గెలిచాయన్నారు. ప్రజలకు సేవ చేయాలనే చిరంజీవి పార్టీ పెడితే పక్కన ఉన్నవాళ్లే నిరాశపరిచారని గుర్తు చేసుకున్నారు. ఇందిరా గాంధీలా ఎంత ఒత్తిడి ఉన్నా తట్టుకునే నాయకులు కావాలన్నారు.

Tags:    

Similar News