భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 163 మంది కరోనాతో మరణించారు. దీంతో [more]

Update: 2021-01-29 05:41 GMT

భారత్ లో కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా భారత్ లో 18,855 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 163 మంది కరోనాతో మరణించారు. దీంతో భారత్ లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,07,20,048 కు చేరుకుంది. ఇప్పటి వరకూ కరోనా బారిన పడి భారత్ లో 1,54,010 మంది మరణించారు. ప్రస్తుతం భారత్ లో యాక్టివ్ కేసుల సంఖ్య 1,71,686 గా ఉంది. కరోనా బారిన పడి కోలుకుని భారత్ లో ఇప్పటి వరకూ 1,03,94,352 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.

Tags:    

Similar News