అగ్రనేతలు దిగుతున్నారు..!

Update: 2018-11-17 11:58 GMT

తెలంగాణ ఎన్నికల ప్రచారానికి జాతీయ పార్టీల అగ్రనేతలు దిగుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ డిసెంబర్ 3, 5వ తేదీల్లో రాష్ట్రంలో నాలుగు సభల్లో ఆయన పాల్గొని ప్రచారం చేయనున్నారు. మరో వైపు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కూడా ఈ నెల చివర్లోనే ప్రచారపర్వంలోకి దిగనున్నారు. ఈ నెల 25, 27, 28 తేదీల్లో ఆయన తెలంగాణలో ప్రచారం నిర్వహించనున్నారు.

రెండు సభల్లో పాల్గొననున్న సోనియా గాంధీ

తెలంగాణ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. దీంతో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో పాటు సోనియా గాంధీ కూడా ప్రచారం చేయనున్నారు. సోనియా గాంధీ ఈ నెల 23వ తేదీ ఆమె రాష్ట్రంలో పర్యటించనున్నారు. సోనియా గాంధీతో రెండు సభలు నిర్వహించాలని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు రాహుల్ గాంధీతోనూ కనీసం 8 - 10 సభలు నిర్వహించాలని ప్రణాళికలు రచిస్తోంది.

Similar News