భారత్ బయోటెక్ కు చేరుకున్న మోదీ

ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ కు చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. [more]

Update: 2020-11-28 08:13 GMT

ప్రధాని నరేంద్ర మోదీ భారత్ బయోటెక్ కు చేరుకున్నారు. అహ్మదాబాద్ నుంచి నేరుగా హైదరాబాద్ హకీంపేట్ ఎయిర్ పోర్టుకు మోదీ చేరుకున్నారు. ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా భారత్ బయోటెక్ కు వచ్చారు. సుమారు 20 నిమిషాల పాటు మోదీ రోడ్డు మార్గంలో ప్రయాణించారు. భారత్ బయోటెక్ లో కరోనా వ్యాక్సిన్ పురోగతిని మోదీ పరిశీలిస్తారు. అక్కడ శాస్త్రవేత్తలు, నిపుణులతో చర్చిస్తారు. ఇక్కడ నుంచి నేరుగా ప్రధాని నరేంద్ర మోదీ పూనే వెళ్లనున్నారు.

Tags:    

Similar News