కోతలు కోసి జగన్ “కోత” పెడుతున్నాడు

వైసీపీ ప్రభుత్వం పింఛన్లలో కోత పెట్టడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం తెలిపారు. జగన్ మాట ఇచ్చి తప్పుతున్నారన్నారు. పించన్లలో కోత పెట్టడం [more]

Update: 2021-09-06 05:42 GMT

వైసీపీ ప్రభుత్వం పింఛన్లలో కోత పెట్టడంపై తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం తెలిపారు. జగన్ మాట ఇచ్చి తప్పుతున్నారన్నారు. పించన్లలో కోత పెట్టడం కారణంగా రాష్ట్రంలో 13 మ ంది వృద్ధులు ఆవేదనతో మరణించారని లోకేష్ తెలిపారు. అవ్వాతాతలకు జగన్ అన్యాయం చేస్తున్నారన్నారు. జగన్ మాట ఇచ్చిన ప్రకారం చూసుకున్నా ఇప్పుడు పింఛను 2,750లు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. జగన్ ను నమ్మి ఓటేసిన వృద్ధులను మోసం చేస్తున్నారన్నారు. పింఛన్లలో కోత పెడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా రెండున్నర లక్షల పింఛన్లను తొలగించారని నారా లోకేష్ ఆరోపించారు. పింఛన్లను అర్హులందరికీ చెల్లించకుంటే ఉద్యమం తప్పదని నారా లోకేష్ హెచ్చరించారు.

Tags:    

Similar News