ప్ర‌జాసేవ కోసం ప్ర‌పంచ బ్యాంకు ఉద్యోగం వ‌దులుకున్నా

త‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని, ఆరోప‌ణ‌లు రుజువు చేసేందుకు ఒక్క ఆధారమైనా ఆయ‌న చూపించ‌గ‌ల‌రా అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ [more]

Update: 2019-02-10 11:51 GMT

త‌న‌పై ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌డం స‌రికాద‌ని, ఆరోప‌ణ‌లు రుజువు చేసేందుకు ఒక్క ఆధారమైనా ఆయ‌న చూపించ‌గ‌ల‌రా అని ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి నారా లోకేష్ ప్ర‌శ్నించారు. ఆదివారం ఆయ‌న తిరుప‌తిలో కార్బ‌న్ మొబైల్స్ ప్రారంభోత్స‌వంలో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా మోడీ వ్యాఖ్య‌ల‌పై ఆయ‌న మాట్లాడుతూ… తాను విదేశాల్లో చ‌దువుకొని.. రెండేళ్లు ప్ర‌పంచ బ్యాంకులో ఉద్యోగం చేసి వ‌చ్చాన‌ని పేర్కొన్నారు. ప్ర‌జా సేవ కోసం ఉద్యోగం వ‌దులుకొని రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌న్నారు. చంద్ర‌బాబును ల‌క్ష్యంగా మోడీ మాట్లాడారు కానీ.. ప్ర‌త్యేక హోదా, రైల్వే జోన్, ఉక్కు క‌ర్మాగారంపై ఎందుకు మాట్లాడ‌లేద‌ని ప్ర‌శ్నించారు. ప్ర‌ధాని స‌భ‌కు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే జ‌న‌స‌మీక‌ర‌ణ చేసింద‌ని ఆరోపించారు.

Tags:    

Similar News