ఈ నెల 16 న జగన్ తో మోడీ?

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. 16వ [more]

Update: 2020-06-13 02:51 GMT

ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16, 17 తేదీల్లో ముఖ్యమంత్రులతో భేటీ కానున్నారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడనున్నారు. 16వ తేదీన ఏపీ ముఖ్యమంత్రి జగన్, 17 వతేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో మాట్లాడనున్నారు. లాక్ డౌన్ మినహాయింపుల తర్వాత కేసులు పెరుగుతుండటంతో ప్రధాని మోదీ ముఖ్యమంత్రులతో భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. లాక్ డౌన్ అమలులో ఉన్న సమయంలో కేసుల సంఖ్య తక్కువగా ఉందని, మినహాయింపులు ఇచ్చిన తర్వాతనే కేసుల సంఖ్య పెరుగుతుందన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాని సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News