కోహ్లీ, రోహిత్, ధోనిలను దాటేసిన మిథాలీ రాజ్

Update: 2018-11-16 06:22 GMT

భారత క్రికెట్ లో స్టార్లు అనగానే గుర్తుకువచ్చే పేర్లు విరాట్ కోహ్లీ, మహేంద్ర సింగ్ ధోని, రోహిత్ శర్మ. కానీ, వీరి రికార్డులను బ్రేక్ చేసి వీరి కంటే ముందు నిలిచింది టీమిండియా మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్. ప్రస్తుతం ప్రపంచ మహిళా టీ20 కప్ లో ఆడుతున్న ఆమె టీ20 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ గా నలిచింది. అంతర్జాతీయ టీ20ల్లో మిథాలీ రాజ్ ప్రస్తుతం 2283 పరుగులతో మొదటి స్థానంలో ఉండగా... రోహిల్ శర్మ(2207) రెండో స్థానంలో, విరాట్ కోహ్లీ(2102) మూడో స్థానంలో, మహిళా క్రికెటర్ హర్మన్ ప్రీత్(1827) నాలుగో స్థానంలో, సురేష్ రైనా(1605) ఐదో స్థానంలో, మహేంద్ర సింగ్ దోని(1487) ఆరో స్థానంలో ఉన్నారు.

Similar News