టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

ప్రధాన మంత్రి మార్చి 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో జరిగే ప్రజా కార్యక్రమంలో 56,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గంలో మార్చి 4న రాత్రి 7:40 నుంచి 8:10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

Update: 2024-03-04 12:43 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

ప్రధాని మోదీ పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలు అమలు

ప్రధాన మంత్రి మార్చి 4న తెలంగాణలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్‌లో జరిగే ప్రజా కార్యక్రమంలో 56,000 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన బహుళ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేయనున్నారు. ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా, బేగంపేట విమానాశ్రయం నుంచి రాజ్‌భవన్‌కు వెళ్లే మార్గంలో మార్చి 4న రాత్రి 7:40 నుంచి 8:10 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి.

Google Play Store:ప్లేస్టోర్‌ నుంచి యాప్స్‌ తొలగింపుపై కేంద్రం రియాక్షన్‌.. వెనక్కి తగ్గిన గూగుల్‌.. కారణం ఏంటంటే

Google Play Store:గత రెండు రోజుల కిందట గూగుల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. 10 భారతీయ యాప్‌లను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి తొలగించింది. అందుకు కారణం లేకపోలేదు. ఈ యాప్ డెవలపర్లు తమ మార్గదర్శకాలను పాటించడం లేదని, అందుకే ఈ చర్య తీసుకుంటున్నామని సెర్చ్ ఇంజన్ కంపెనీ తెలిపింది.


Mahesh Babu : 'బిజినెస్‌మెన్' సినిమా ఆ హీరో చేయాల్సింది.. కానీ మహేష్..

Mahesh Babu : సూపర్ స్టార్ మహేష్ బాబు, మాస్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చి ఇండస్ట్రీని షేక్ చేసిన సినిమా 'పోకిరి'. దాని తరువాత మళ్ళీ ఆ కాంబినేషన్ లో వచ్చిన మోస్ట్ హైపెడ్ మూవీ 'బిజినెస్‌మెన్'. ముంబై డాన్ బ్యాక్‌డ్రాప్ తో వచ్చిన ఈ సినిమాలో మహేష్ బాబు..

SRH: సన్ రైజర్స్ కొత్త కెప్టెన్ వచ్చేశాడు

IPL 2024 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు కొత్త కెప్టెన్ వచ్చాడు. స్టార్ ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ పాట్ కమిన్స్ ను సన్ రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం కెప్టెన్‌గా ఎంపిక చేసింది. కమ్మిన్స్ ఇకపై ఐడెన్ మార్క్రామ్ స్థానంలో కెప్టెన్ గా నియమితుడయ్యాడు. సన్ రైజర్స్ ఫ్రాంచైజీ గత సీజన్‌లో చివరి స్థానంలో నిలిచింది.

Shraddha Kapoor : శ్రద్ధా కపూర్ బాయ్ ఫ్రెండ్ అతనేనా.. వీడియో వైరల్

Shraddha Kapoor : బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్.. 'సాహో' సినిమాతో తెలుగు ఆడియన్స్ కి పరిచయమైంది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేస్తూ హీరోయిన్ గా బిజీగా ఉంది. ఇది ఇలా ఉంటే, గత కొంతకాలంగా ఈ భామ ప్రేమ వ్యవహారం గురించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

ఆ విషయంలో ఆవేదన వ్యక్తం చేసిన సెల్వమణి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు ఎక్కువగా చర్చించుకునే నియోజకవర్గాల్లో 'నగరి' ఒకటి. ఎందుకంటే అక్కడ ఏపీ మంత్రి, సినీ నటి రోజా సెల్వమణి పోటీ చేస్తున్నారు. వైసీపీ వ్యతిరేకులపై కౌంటర్లు వేయడంలో రోజాను మించిన వారు లేరు. ఇక పర్యాటక మంత్రిగా ఎంతో బిజీ బిజీగా ఉండే రోజా..

Lalu comments on Modi:ప్రధాని మోదీ హిందువు కాదంటూ

Lalu comments on Modi:ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్ యాదవ్ భారత ప్రధాని నరేంద్ర మోదీ పై తీవ్ర విమర్శలు చేశారు. పాట్నా లోని గాంధీ మైదాన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ అసలు హిందువే కాదని అన్నారు. ప్రధాని మోదీ హిందువు కాదని, ఆయన తల్లి మరణిస్తే గుండు కొట్టించుకోలేదని ఆరోపించారు.

లొంగిపోయిన జయప్రద

సీనియర్ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టులో లొంగిపోయారు. గత ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్ ను ఉల్లంఘించారంటూ జయప్రదపై రెండు కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల విచారణకు ఆమె హాజరు కాకపోవడంతో ఆమెకు కోర్టు నోటీసులు, నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ చేశారు.

మరో క్రేజీ ప్రాజెక్టులో మీనాక్షి చౌదరి

మీనాక్షి చౌదరి.. గుంటూరు కారంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది ఈ ముద్దుగుమ్మ. మీనాక్షిని మరీ అంత చిన్న క్యారెక్టర్ లో చూస్తామని ఆమె ఫ్యాన్స్ అసలు ఊహించలేదు. ఒక పాటలో కూడా మీనాక్షి కనిపించలేదు. అయితే అమ్మడికి వరుస ఆఫర్లు మాత్రం టాలీవుడ్ లో వస్తూనే ఉన్నాయి.

వాలంటీర్ ఉద్యోగాలు.. చంద్రబాబు నాయుడు చెబుతోంది ఇదే!!

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను తీసుకుని వచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవస్థపై గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. వాలంటీర్లు దారుణాలకు తెగబడుతూ ఉన్నారని ఆరోపించారు. అయితే ఈ ఎన్నికల్లో టీడీపీ ప్రభుత్వం వస్తే వాలంటీర్ల ఉద్యోగాలు పోతాయనే అనుమానాలు కూడా ఉన్నాయి.


Tags:    

Similar News