టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

టాప్ 10 లేటెస్ట్ తెలుగు న్యూస్

Update: 2024-01-25 12:52 GMT

(నోట్: పూర్తి వివరాలకు హెడ్లైన్ ని క్లిక్ చేయండి )

Telangana : మే రెండో వారంలో ఎంసెట్?

తెలంగాణ ఎంసెట్ ను ఈ ఏడాది మే నెలలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రవేశ పరీక్ష తేదీలను కూడా త్వరలో ప్రకటించనున్నారు. మొత్తం ఏడు పరీక్షలకు ఎంసెట్ నిర్వహించనున్నారు.

Shiva Balakrishna : విల్లాలు.. కిలోల కొద్దీ బంగారం.. వెండి.. ఖరీదైన వాచ్‌లు ఒక్క అధికారి.. ఇన్ని కోట్ల ఆస్తులా?

హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ నివాసంలో ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. హైదరాబాద్‌లోనే రెండు విల్లాలున్నాయి. ఇక తెలంగాణలోని పలు రాష్ట్రాల్లో పదుల ఎకరాల్లో భూములున్నాయి.

Ap Elections : ఆ పార్టీ అక్కడ బోణీ కొడుతుందా? మరి ఆయనకు మళ్లీ విజయమేనా?

రాజకీయాల్లో హిస్టరీని ఎవరూ చెరపేయలేరు. అవి రికార్డులో పదిలంగానే ఉంటాయి. వాటిని ఎవరూ కాదనలేరు. కనిపించకుండా చేయను కూడా లేరు. ఇది వాస్తవం. ఒక్కోసారి రాజకీయాల్లో విచిత్రమైన ఘటనలు కూడా జరుగుతుంటాయి.

Sai Pallavi - Ashika : సిస్టర్స్ మ్యారేజ్స్ చేస్తున్న హీరోయిన్స్..

అందాల భామలు సాయి పల్లవి, ఆషికా రంగనాథ్.. ప్రస్తుతం తమ సిస్టర్స్ పెళ్లి చేసే భాద్యతలను తీసుకున్నారు. ప్రెజెంట్ సాయి పల్లవి అండ్ ఆషికా..


గణతంత్ర దినోత్సవాన్ని జనవరి 26న ఎందుకు.. రాజ్యాంగంకు ఎంత సమయం పట్టింది?

ఎందరో త్యాగధనుల పోరాట ఫలితంగా 1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన నుంచి పొందిన తర్వాత మనకు స్వాతంత్ర్యం లభించింది. బ్రిటిష్ పార్లమెంట్ ఆమోదించిన 1947 భారత స్వాతంత్రం చట్టం కింద రాజ్యాంగ అధినేత గా 6వ జార్జి ప్రభువు, ఎర్ల్ మౌంట్ బాటన్ గవర్నర్ జనరల్ గాను మనకు స్వాతంత్ర్యం సిద్దించింది.

ఎక్కువసేపు చీకటిలో ఉంటే మెదడుపై ప్రభావం.. ఈ తప్పులు అస్సలు చేయకండి

మనం మన గుండె, కాలేయం, మూత్రపిండాలు, ఇతర అవయవాలను ఆరోగ్యంగా ఉంచడానికి ఎలా ప్రయత్నిస్తామో, అదే విధంగా మన మెదడు కూడా ఆరోగ్యంగా ఉండటానికి కొన్ని విషయాలు అవసరం. లేకపోతే మెదడు దెబ్బతినే అవకాశం ఉంది. మెదడును మన శరీరం పవర్‌హౌస్ అని పిలుస్తారు.

Oil Prices: గుడ్‌న్యూస్‌ చెప్పనున్న కేంద్రం.. మరింత తగ్గనున్న వంటనూనె ధరలు

వినియోగదారులకు ఊరటనిచ్చేందుకు మోడీ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. వంట నూనె ధరలను మరింతగా తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు కేంద్ర వర్గాల ద్వారా సమాచారం. ఇప్పటికే ఆయిల్‌ ధరలను తగ్గించగా, ఇప్పుడు మరింత తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

పార్లమెంట్‌ వద్ద 140 మంది సీఐఎస్‌ఎఫ్‌ బలగాల మోహరింపు

ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. సమావేశాలు దగ్గర పడుతుండటంతో ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేశారు. బడ్జెట్ సెషన్‌లో వచ్చేవారిని పరీక్షించేందుకు 140 మంది సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) సిబ్బందిని పార్లమెంట్ కాంప్లెక్స్‌లో మోహరించారు.

Revanth Reddy : ఓ బికారీ.. అవును నేను మేస్త్నీనే.. కేటీఆర్‌కు రేవంత్ ఘాటు రిప్లై

పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొద్దామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు. ఎల్.బి. స్టేడియంలో జరిగిన బూత్ లెవెల్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మోదీని ఓడించి రాహుల్ ను ప్రధానిగా చేయడమే లక్ష్యంగా పనిచేయాలని కోరారు.

Breaking : ఎంసెట్ పేరు మార్పు... ఉమ్మడి పరీక్ష తేదీల ఖరారు

తెలంగాణలో ఉమ్మడి పరీక్షలకు తేదీలను ఉన్నత విద్యామండలి ఖరారు చేసింది. ఎంసెట్ ను eapset గా మార్చారు. పీసెట్, లాసెట్ పరీక్షలకు తేదీలను ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకుంది. మే 9 13 వరకూ eapset పరీక్షలు జరుగుతున్నాయి.


Tags:    

Similar News