Kodali nani : దొంగదీక్షలను ఎవరు నమ్ముతారు

చంద్రబాబు దీక్షలను ఎవరూ నమ్మరని మంత్రి కొడాలి నాని అన్నారు. కుట్ర రాజకీయాలను చంద్రబాబు మానుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు గురించి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అన్న [more]

Update: 2021-10-20 12:51 GMT

చంద్రబాబు దీక్షలను ఎవరూ నమ్మరని మంత్రి కొడాలి నాని అన్నారు. కుట్ర రాజకీయాలను చంద్రబాబు మానుకోవడం లేదని అన్నారు. చంద్రబాబు గురించి టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అన్న మాటలను ఆయన గుర్తు చేశారు. అమిత్ షా మీద ఇక్కడ రాళ్ల దాడి చేసి, అదే అమిత్ షాను కలిసేందుకు చంద్రబాబు ఢిల్లీ వెళుతున్నారని కొడాలి నాని ఎద్దేవా చేశారు. మోదీకి వ్యతిరేకంగా నల్లచొక్కా వేసుకుని ఢిల్లీలో దీక్షలు చేసిన చంద్రబాబు మళ్లీ ఢిల్లీ వెళుతున్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలిసే ఈ కుట్రకు తెరతీశారని కొడాలి నాని అన్నారు. హెరిటేజ్ ఫుడ్స్ లోనే చంద్రబాబు గంజాయి విక్రయించారని కొడాలి నాని ఆరోపించారు.

Tags:    

Similar News