ప్రజలు టానిక్ పోశారు

హుజూర్ నగర్ ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి అద్భుతమైన మెజార్టీ విజయాన్ని ప్రజలు అందించారని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్ నగర్ లో విజయం సాధించడం పట్ల [more]

Update: 2019-10-24 11:30 GMT

హుజూర్ నగర్ ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డికి అద్భుతమైన మెజార్టీ విజయాన్ని ప్రజలు అందించారని సీఎం కేసీఆర్ అన్నారు. హుజూర్ నగర్ లో విజయం సాధించడం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అక్కడి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలంతా అలవోకగా వేసిన ఓట్లు కాదని, మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. ఈ గెలుపు ప్రభుత్వానికి టానిక్ లా పనిచేస్తుందన్నారు కేసీఆర్. ప్రతి పక్షాలు ఎన్నో నీలాపనిందలు వేశారని అది మంచి పద్దతి కాదన్నారు కేసీఆర్. హుజూర్ నగర్ ప్రజల ఆశలు నెరవేరుస్తామని, వారి కోరికలు తీరుస్తామని చెప్పారు. ఎల్లుండి హుజూర్ నగర్ ప్రజలను కలుస్తానని తెలిపారు. ఇప్పటికైనా ప్రతిపక్షాలు తమ పంథా మార్చుకోవాలని సూచించారు. ఉప ఎన్నికలో ప్రతిపక్షాలు పిచ్చిపిచ్చిగా ప్రచారం చేశారని ఇప్పుడు ఏమైందని ప్రశ్నించారు కేసీఆర్. ఈ గెలుపు వల్ల అహంబావం పడాల్సిన అవసరం లేదని నాయకులకు సూచించారు. గర్వపడాల్సిన పని కూడా లేదని, ఈ విజయం వల్ల మరింత బాధ్యత పెరిగిందన్నారు కేసీఆర్. సంస్కారంతో కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు.

 

Tags:    

Similar News