సూర్యాపేటకు నేడు కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటలో పర్యటించనునన్నారు. ఇటీవల భారత సరిహద్దుల్లో మరణించిన సంతోష్ బాబు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ స్వయంగా [more]

Update: 2020-06-22 02:30 GMT

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు సూర్యాపేటలో పర్యటించనునన్నారు. ఇటీవల భారత సరిహద్దుల్లో మరణించిన సంతోష్ బాబు కుటుంబాన్ని కేసీఆర్ పరామర్శిస్తారు. సంతోష్ బాబు కుటుంబానికి కేసీఆర్ స్వయంగా ఐదుకోట్ల రూపాయల ఆర్థిక సాయం అందచేస్తారు. దీంతోపాటు హైదరాబాద్ లోని షేక్ పేట్ లో 500 గజాల ఇంటి స్థల పట్టాను కూడా కేసీఆర్ సంతోష్ బాబు కుటుంబ స‌భ్యులకు అందజేయనున్నారు. సంతోష్ బాబు సతీమణికి గ్రూప్ ఒన్ ఉద్యోగం ఇవ్వనున్నారు. కేసీఆర్ పర్యటన ఉండటంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు.

Tags:    

Similar News