అంతా జగన్ వల్లనే

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి కారణంగానే విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. విభజన హామీలను [more]

Update: 2021-03-25 01:19 GMT

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వైఖరి కారణంగానే విభజన హామీలను కేంద్ర ప్రభుత్వం అమలు చేయడం లేదని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. విభజన హామీలను అమలు చేయకుండా ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందని తెలిపారు. మూడు రాజధానుల ప్రతిపాదనను తెచ్చి అమరావతిని నాశనం చేశారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణను కూడా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. జగన్ వచ్చాక అప్పులు చేస్తూ ఏపీ ప్రజలపై మరింత భారాన్ని మోపుతున్నారని కనకమేడల రవీంద్ర కుమార్ ఆరోపించారు.

Tags:    

Similar News