రాజకీయ కక్ష కాక మరి ఇంకేంటి?

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయాలు ప్రభుత్వంలో [more]

Update: 2021-03-17 01:13 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుకు నోటీసులు ఇవ్వడం రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమేనని రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు. చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయాలు ప్రభుత్వంలో ఉండవని తెలుసుకోవాల్సి ఉంటుందన్నారు. పాలనాపరమైన నిర్ణయం తీసుకుంటే దళితుల భూములకు ఎలా ముడిపెడతారని కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. గతంలో వైఎస్ కూడా అసెన్డ్ భూములను తన అధీనంలో ఉంచుకున్నారన్నారు. దేశంలో ఇలా రాజకీయ కక్షలు లేవని కనకమేడల రవీంద్ర కుమార్ తెలిపారు.

Tags:    

Similar News