జగన్ మొండిగా ముందుకు వెళుతున్నారు

జగన్ మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. హడావిడిగా ఎన్నికలను నిర్వహించడంతో బీసీలు దాదాపు 16వేల పదవులు కోల్పోతున్నారన్నారు. [more]

Update: 2020-03-06 13:01 GMT

జగన్ మొండిగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళుతున్నారని ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. హడావిడిగా ఎన్నికలను నిర్వహించడంతో బీసీలు దాదాపు 16వేల పదవులు కోల్పోతున్నారన్నారు. జగన్ వ్యవస్థలన్నింటినీ తన గుప్పిట్లో ఉంచుకున్నారన్నారు. రిజర్వేషన్లపై కనీసం సుప్రీంకోర్టుకు వెళ్లకుండా ఎన్నికలను నిర్వహిస్తుండటం బీసీలపై ఆయనకున్న ప్రేమ ఏంటో అర్థమవుతుందన్నారు. పది నెలల్లో జగన్ ప్రభుత్వం ఏ వర్గాలకూ న్యాయం చేయలేదన్నారు. ప్రజలు అందరూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని కళా వెంకట్రావు కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని కోరారు.

Tags:    

Similar News