ఏపీలో నాజీ తరహా పాలన.. జేసీ సంచలన ఆరోపణలు

తెలుగుదేశం పార్టీ నేతలపై అనవసర కేసులు నమోదు చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం [more]

Update: 2021-04-23 01:17 GMT

తెలుగుదేశం పార్టీ నేతలపై అనవసర కేసులు నమోదు చేస్తున్నారని తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. మాట్లాడితే కేసులు పెడుతున్నారన్నారు. రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తుందని జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ లో నాజీ తరహా పాలన సాగుతుందని తీవ్ర విమర్శలు చేశారు. టీడీపీ నేతలపై వైసీపీ నేతలు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కేసులు ఉండటం లేదని జేసీ ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఘటనలతో సంబంధం లేని వారిపై కూడా కేసులు నమోదు చేయడం ఏపీలోనే జరుగుతుందని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News