జగన్ పై జేసీ సెటైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సెటైర్ వేశారు. జగన్ పాలనలో కిందా మీదా పడుతున్నారన్నారు. జగన్ [more]

Update: 2019-10-23 09:46 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మాజీ పార్లమెంటు సభ్యుడు జేసీ దివాకర్ రెడ్డి మరోసారి సెటైర్ వేశారు. జగన్ పాలనలో కిందా మీదా పడుతున్నారన్నారు. జగన్ పాలనకు వందకు 150 మార్కులు వేయాల్సిందేనని జేసీ దివాకర్ రెడ్డి ఎద్దేవా చేశారు. జగన్ ఎప్పటికి తమ వాడేనన్నారు. తమ ట్రావెల్స్ బస్సులను 31 సీజ్ చేశారన్నారు. ట్రావెల్స్ వ్యాపారంలో చిన్నా చితకా లోపాలుంటాయని, అయితే జరిమానాలతో సరిపెట్టాల్సిందిపోయి సీజ్ చేశారన్నారు. వీటిపై తాము న్యాయపరంగా పోరాటం చేస్తామని జేసీ దివాకర్ రెడ్డి తెలిపారు. రాయలసీమలో ఎంత వర్షం పడినా ప్రయోజనం లేదని, ప్రాజెక్టులు ఉంటేనే ఫలితం ఉంటుందని జేసీచెప్పారు.

Tags:    

Similar News