జగన్ కు క్షమాపణలు చెప్పిన జేసీ

చంద్రబాబుతో ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారని జేసీ దివాకార్ రెడ్డి అన్నారు. జేసీ దివాకార్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఫైర్అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకే [more]

Update: 2020-06-13 13:18 GMT

చంద్రబాబుతో ఉన్న ఒక్కొక్కరిని అరెస్ట్ లు చేస్తున్నారని జేసీ దివాకార్ రెడ్డి అన్నారు. జేసీ దివాకార్ రెడ్డి ఏపీ ప్రభుత్వంపై ఫైర్అయ్యారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి చేసేందుకే ఈ అక్రమ అరెస్ట్ అని జేసీ దివాకర్ రెడ్ి అన్నారు. ట్రావెల్స్ బస్సుల విషయంలో అడుగడుగునా తమను వేధించారన్నారు. ఇది ముమ్మాటికీ కక్ష సాధింపు చర్యేనని తెలిపారు. కేసులు మీద కేసులు పెడుతూ తమను ఇబ్బందులు పాలు చేయాలని ప్రయత్నించారన్నారు. కోహిమాలో ఏం జరిగిందో విచారణ జరిపించాలని జేసీ దివాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మా ట్రావెల్స్ బస్సులో సీటు బెల్ట్ పెట్టుకోలేదని కూడా కేసులు నమోదు చేశారన్నారు. ఆర్టీసీ బస్సుల్లో డ్రైవర్లు ఎక్కడైనా సీటు బెల్ట్ పెట్టుకోవడం చూశామా? అని జేసీ దివాకర్ రెడ్డి ప్రశ్నించారు. ఆయనే రాజు ఆయనే మంత్రిగా పాలన సాగుతుందన్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు క్షమాపణలు చెబుతున్నానని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. కొన్నేళ్ల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి దురుసుగా మాట్లాడిన మాట వాస్తవమేనని జేసీ దివాకర్ రెడ్డి తెలపిారు. కొన్ని మాటలు తనకు ఊత పదాలని, వాటి వెనక దురుద్దేశ్యం లేదని జేసీ దివాకర్ రెడ్డి అన్నారు.

Tags:    

Similar News