తెలంగాణలో కరోనా పరీక్షలపై హైకోర్టు ఆగ్రహం

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్ లో అరకొర సమాచారం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతొందని ధర్మాసనం [more]

Update: 2020-07-01 13:18 GMT

రాష్ట్రంలో కరోనా పరీక్షలు, మీడియా బులెటిన్ లో అరకొర సమాచారం పై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం పెడచెవిన పెడుతొందని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మీడియా బులెటిన్ లో వార్డుల వారీగా కీలక సమాచారం ఉండాలన్న ఆదేశాలు అమలు కావడం లేదని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి చురకలు అంటించింది. కరోనా నుంచి ప్రజలను కాపాడాల్సిన రాజ్యాంగ పరమైన బాధ్యత ప్రభుత్వంపై ఉందని హైకోర్టు పేర్కొంది. కరోనా పరీక్షలు నిలిపివేస్తూ ప్రజారోగ్య డైరెక్టర్ ఉత్తర్వులు ఇవ్వడం ఆశ్చర్యకరమని హైకోర్టు అభిప్రాయపడింది. ఐసీఎంఆర్ నిబంధనలకు విరుద్ధంగా పీహెచ్ డైరెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. రాష్ట్రంలో కంటైన్మెంట్ విధానమేంటో తెలపాలని హైకోర్టు ఆదేశించింది. రాష్ట్రంలో కంటైన్మెంట్ ప్రాంతాల వివరాలు సమర్పించాలని ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్రంలో 20 రోజులుగా జరిగిన కరోనా పరీక్షల వివరాలను కూడా తెలపాలని ఆదేశించింది. అలాగే కేంద్ర బృందం పరిశీలనలో తేలిన అంశాలను సమర్పించాలని కూడా పేర్కొంది. ఈనెల 17లోగా తమ ఉత్తర్వులను కచ్చితంగా అమలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఒకవేళ అమలు కాకపోతే ఈనెల 20న సీఎస్‌, వైద్యారోగ్య, మున్సిపల్‌ ముఖ్య కార్యదర్శులు హాజరుకావాలని ఆదేశించింది.

Tags:    

Similar News