కరోనాతో మాజీ ఎమ్మెల్యే మృతి

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి చెందారు. ఆయన కు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించారు. కరోనా పాజిటివ్ గా తేలడంతో [more]

Update: 2020-08-04 02:15 GMT

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతి చెందారు. ఆయన కు జ్వరం రావడంతో కుటుంబ సభ్యులు కరోనా పరీక్షలు చేయించారు. కరోనా పాజిటివ్ గా తేలడంతో సున్నం రాజయ్యను విజయవాడ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సున్నం రాజయ్య మృతి చెందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో భద్రాచలం నియోజకవర్గం నుంచి సున్నం రాజయ్య మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా సున్నం రాజయ్య సాధారణ జీవితం గడుపుతున్నారు. సున్నం రాజయ్య మృతి వామపక్ష పార్టీలకు తీరని లోటని చెప్పాలి. సున్నం రాజయ్యకు 59 సంవత్సరాలు.

Tags:    

Similar News