డాలర్ శేషాద్రి తొలగింపు

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 148 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో డాలర్ శేషాద్రి [more]

Update: 2019-11-01 03:49 GMT

తిరుమల తిరుపతి దేవస్థానం సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న దాదాపు 148 మందిని విధుల నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీరిలో డాలర్ శేషాద్రి కూడా ఉన్నారు. పదవీకాలం పూర్తయినప్పటికీ ఓఎస్డీగా కొనసాగుతున్న డాలర్ శేషాద్రిని పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు తొలగించిన వాళ్లంతా పదవీ విరమణ పూర్తయినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులుగా కొనసాగుతున్నారు. డాలర్ శేషాద్రి ఎన్ని ప్రభుత్వాలు మారినా ఓఎస్డీగా కొనసాగుతున్నారు. ఆయనను ఏ ప్రభుత్వమూ తప్పించలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం మాత్రం డాలర్ శేషాద్రిని తొలగించడం చర్చనీయాంశమైంది.

Tags:    

Similar News