బ్రహ్మనాయుడూ నీ బతుకు నాకు తెలియదా?

వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. బ్రహ్మనాయుడు తన పనికి రాని భూములను ప్రభుత్వానికి 18 కోట్లకు [more]

Update: 2021-07-24 06:22 GMT

వినుకొండ వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుపై మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర తీవ్ర విమర్శలు చేశారు. బ్రహ్మనాయుడు తన పనికి రాని భూములను ప్రభుత్వానికి 18 కోట్లకు విక్రయించారని నరేంద్ర ఆరోపించారు. ఆ డబ్బులతో సమీపంలో కొన్న భూములను కొనలేదా అని ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు. బైపాస్ రోడ్డును కూడా తమ పొలాల సమీపంలోకి మళ్లించి భూముల ధరలను పెంచుకున్నారన్నారు. బ్రహ్మనాయుడు తనపై విమర్శలు చేసే అర్హత లేదన్నారు. సంగం డెయిరీని నిబద్దతో నడుపుతున్నామని చెప్పారు. డెయిరీని నిర్వహించిన బ్రహ్మనాయుడుకు పాడి రైతులకు ఇచ్చే బోనస్, ప్రోత్సహాకాల గురించి తెలియదా అని ధూళిపాళ్ల నరేంద్ర నిలదీశారు.

Tags:    

Similar News