రేపటి నుంచి లాక్ డౌన్ మరింత కఠినం

రేపటి నుంచి లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాస్ ల స్థానంలో కొత్త పాస్ [more]

Update: 2020-04-20 12:27 GMT

రేపటి నుంచి లాక్ డౌన్ మరింత కఠినంగా అమలు చేస్తున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాస్ ల స్థానంలో కొత్త పాస్ లను ఇస్తామని చెప్పారు. మూడు కిలోమీటర్ల పరిధి దాటి వస్తే అందుకు తగిన కారణాలు స్పష్టం చెప్పాలని, ఆధారాలు చూపాలని చెప్పారు. నివాసిత గుర్తింపు కార్డు కూడా పోలీసులకు చూపించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా పాస్ లు తీసుకుని దుర్వినియోగం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వారికి కూడా ఆరు రంగులతో కూడిన పాస్ లు ఇస్తున్నామన్నారు. విధులకు హాజరయ్యే వారికే పాస్ లు ఇవ్వనున్నట్లు మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:    

Similar News