జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారు

వైసీపీ మత విశ్వాసాలను కించపరుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారని [more]

Update: 2019-11-21 05:08 GMT

వైసీపీ మత విశ్వాసాలను కించపరుస్తుందని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంపై మంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై ఏం చర్యలు తీసుకున్నారని దేవినేని ఉమ ప్రశ్నించారు. తిరుమలలో కూర్చుని వైవీసుబ్బారెడ్డి పంచాయతీలు చేస్తున్నారని దేవినేని ఉమ ఆరోపించారు. కొండ మీద వైవీ సుబ్బారెడ్డి రాజకీయాలు చేస్తున్నారన్నరాు. పోలవరం ప్రాజెక్టు ఏపీకి ప్రాణప్రదాయని తెలిసినా దానిని గాలికి వదిలేశారన్నారు. పోలవరం చూడని నేతలు కూడా దాని గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. గిన్నీస్ రికార్డులకు ఎక్కిన సంస్థలను కూడా పంపించి వేశారన్నారు. సీఎం జగన్ ఫ్రస్టేషన్ లో ఉన్నారన్నారు. అయ్యప్ప మాల వేసుకున్న నాయకులతో తమను జగన్ తిట్టిస్తున్నారన్నారు. కరెన్సీ నోట్లు చించి వైసీపీ నాయకులు ప్రజలకు పంచారన్నారు. వసంత కృష్ణప్రసాద్ అనుచరులే ఈ దారుణానికి ఒడిగట్టారన్నారు.

Tags:    

Similar News