బిగ్ బ్రేకింగ్ : టీఆర్ఎస్ లోకి కేసీఆర్ ప్రత్యర్థి

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై రెండుసార్లు పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాలని [more]

Update: 2019-01-17 10:49 GMT

గజ్వేల్ నియోజకవర్గంలో కేసీఆర్ పై రెండుసార్లు పోటీ చేసిన వంటేరు ప్రతాప్ రెడ్డి ఊహించని నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. రేపు సాయంత్రం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో వంటేరు టీఆర్ఎస్ లో చేరనున్నారు. గజ్వేల్ నియోజకవర్గంలో మంచి పట్టున్న వంటేరు 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి కేసీఆర్ కి గట్టి పోటీ ఇచ్చారు. 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి 60 వేలకు పైగా ఓట్లు సాధించారు. టీఆర్ఎస్ కి, ముఖ్యంగా కేసీఆర్ కి బద్ధ వ్యతిరేకిగా ఉన్న వంటేరు పార్టీ మారడం తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Tags:    

Similar News