ట్రిపుల్ తలాక్ బిల్లుపై చంద్రబాబు మంతనాలు

ముస్లింలపై వేదింపులను అడ్డుకోవాలని, ముస్లింల హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, [more]

Update: 2018-12-31 07:19 GMT

ముస్లింలపై వేదింపులను అడ్డుకోవాలని, ముస్లింల హక్కులను కాపాడాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేసి మంతనాలు జరిపారు. భారతీయ జనతా పార్టీ ముస్లిం వ్యతిరేక చర్యలను అడ్డుకోవాలని ఆయన వారిని కోరారు. ట్రిపుల్ తలాక్ కి వ్యతిరేకంగా బీజేపీయేతర వర్గాలన్నీ ఏకం కావాలని చంద్రబాబు సూచించారు. ఇక, ఆయన టీడీపీ ఎంపీలతోనూ ఈ అంశంపై మాట్లాడారు. త్రిపుల్ తలాక్ కు వ్యతిరేకంగా గళం విప్పాలని వారిని ఆదేశించారు.

Tags:    

Similar News