వెస్ట్ కు నేడు బాబు

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ జేఏసీ చేస్తున్న ఆందోళనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో [more]

Update: 2020-01-18 02:58 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. అమరావతిలోనే రాజధానిని ఉంచాలంటూ జేఏసీ చేస్తున్న ఆందోళనల్లో చంద్రబాబు పాల్గొననున్నారు. ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లాలో జరగనున్న పలు సభల్లో చంద్రబాబు ప్రసంగించనున్నారు. జోలె పట్టి అమరావతి కోసం విరాళాలు సేకరించనున్నారు. ఇప్పటికే తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, అనంతపురం, చిత్తూరు జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నేడు పశ్చిమ గోదావరి జిల్లాకు రానుండటంతో పార్టీ శ్రేణులు పెద్దయెత్తున స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యాయి. కాగా అమరావతి రాజధాని కోసం రైతులు చేస్తున్న ఆందోళన నేడు 32వ రోజుకు చేరుకుంది.

Tags:    

Similar News