స్టే తెచ్చుకునే యోచనలో చంద్రబాబు

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణకు హాజరు కాకుండా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఆయన న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. [more]

Update: 2021-03-17 02:03 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సీఐడీ విచారణకు హాజరు కాకుండా కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఆయన న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. నేడో, రేపో సీఐడీ నోటీసుల విషయంలో చంద్రబాబు కోర్టును ఆశ్రయించే అవకాశముంది. అమరావతి రాజధాని భూముల వ్యవహారంలో సీఐడీ చంద్రబాబుకు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నెల 23వ తేదీన విచారణకు హాజరు కావాలని సీఐడీ నోటీసుల్లో పేర్కొంది. అయితే విచారణకు హాజరు కాకుండా స్టే కోసం చంద్రబాబు కోర్టును ఆశ్రయించనున్నారు.

Tags:    

Similar News