నేడు క్లారిటీ ఇవ్వనున్న చంద్రబాబు

నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత [more]

Update: 2020-05-13 03:58 GMT

నేడు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో చంద్రబాబు పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహానాడు నిర్వహణపై ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశముంది. మహానాడును నిర్వహించాలా? వద్దా? అన్న దానిపై నేడు చంద్రబాబు పొలిట్ బ్యూరో లో చర్చించనున్నారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు మహానాడును జూమ్ యాప్ ద్వారా నిర్వహించవచ్చని తెలుస్తోంది. మహానాడును గత ఏడాది కూడా నిర్వహించకపోవడంతో ఈ ఏడాది నిర్వహించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో పాటు మద్యం దుకాణాలు, విద్యుత్తు ఛార్జీల పెంపు, విశాఖ గ్యాస్ లీక్ సంఘటన వంటి అంశాలపై కూడా చర్చించనున్నారు.

Tags:    

Similar News