బ్రేకింగ్ : బాబు కోసం ముంబయి నుంచి విమానం?

చంద్రబాబు ప్రత్యేక విమానం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శిచేందుకు ప్రతిపక్ష నేతగా తాను వెళ్లాల్సి ఉందని చంద్రబాబు ప్రధాని [more]

Update: 2020-05-07 07:01 GMT

చంద్రబాబు ప్రత్యేక విమానం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరారు. విశాఖపట్నంలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శిచేందుకు ప్రతిపక్ష నేతగా తాను వెళ్లాల్సి ఉందని చంద్రబాబు ప్రధాని నరేంద్ర మోదీ కార్యాలయాన్ని కోరారు. ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రాకు లేఖ రాశారు. తాను విశాఖకు పయనించేందుకు హైదరాబాద్ నుంచి విమానానికి అనుమతి ఇవ్వాలని కోరారు. విటి-వీకేఆర్ విమానం ప్రస్తుతం ముంబయిలో ఉందని, అది హైదరాబాద్ కు వచ్చేలా, అక్కడి నుంచి విశాఖకు వెళ్లేందుకు ఎయిర్ పర్మిషన్ ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం అనుమితిస్తే ముంబయి నుంచి విటి-వీకేఆర్ విమానం హైదరాబాద్ వచ్చి చంద్రబాబును విశాఖను తీసుకెళ్లనుంది.

Tags:    

Similar News