బాబు తేల్చేస్తారట

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో పోటీపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే [more]

Update: 2019-09-28 11:49 GMT

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలలో పోటీపై ఈ సమావేశంలో ఒక స్పష్టత వచ్చే అవకాశముంది. హుజూర్ నగర్ లో పోటీ చేయాలని టీటీడీపీ నేతలు గట్టిగా పట్టుబడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు చేరుకున్న చంద్రబాబు పార్టీ అగ్రనేతలతో సమావేశమయ్యారు. హూజూర్ నగర్ లో పోటీ చేసేందుకు నన్నూరు నర్సిరెడ్డి పోటీ పడుతున్నారు. టీటీడీపీ హుజూర్ నగర్ లో పోటీకి దిగితే పోరు ఆసక్తికరంగా మారనుంది.

Tags:    

Similar News