chandrababu : చంద్రబాబు ఇంటికి వైసీపీ ఎమ్మెల్యే..టెన్సన్ టెన్షన్

చంద్రబాబు ఇంటివద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. చంద్రబాబు తక్షణమే క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు, [more]

Update: 2021-09-17 06:56 GMT

చంద్రబాబు ఇంటివద్ద వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్ నిరసన వ్యక్తం చేయడానికి వచ్చారు. చంద్రబాబు తక్షణమే క్షమాపణ చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్ పై చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జోగి రమేష్ చంద్రబాబు ఇంటి వద్దకు వచ్చారు. ఇది తెలుసుకున్న టీడీపీ నేతలు చంద్రబాబు ఇంటి వద్దకు చేరుకోవడంతో కొంత ఉద్రిక్త పరిస్థిితి నెలకొంది. దీంతో కరకట్టమీద ఉన్న చంద్రబాబు నివాసం వద్ద టెన్షన్ నెలకొంది. జగన్ పై చంద్రబాబు, అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని జోగి రమేష్ డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఇంటి ముట్టడికి వైసీపీ ప్రయత్నం చేయడంతో బుద్దా వెంకన్న వంటి నేతలు వారిని అడ్డుకుంటున్నారు. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

Tags:    

Similar News