వైసీపీకి ప్రజామద్దతు లేనట్లే

రాజధాని ప్రాంత రైతులకు పదమూడు జిల్లాల ప్రజలు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు బాధితులుగా మారిపోయారన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 250 రోజులకు [more]

Update: 2020-08-23 07:55 GMT

రాజధాని ప్రాంత రైతులకు పదమూడు జిల్లాల ప్రజలు అండగా నిలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. రైతులు బాధితులుగా మారిపోయారన్నారు. అమరావతి రైతుల ఉద్యమం 250 రోజులకు చేరుకున్న సందర్భంగా చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇన్ని రోజుల నుంచి ఉద్యమం చేస్తున్నా వారి డిమాండ్స్ ను వినేందుకు కూడా ప్రభుత్వం ముందుకు రాకపోవడం బాధాకరమన్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లేదన్నారు చంద్రబాబు. అమరావతితోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అమరావతి కోసం 85 మంది రైతులు ప్రాణాలర్పించినా ఈ ప్రభుత్వం మనసు కరగడం లేదన్నారు. రాజధాని అంశంపై తిరిగి ఎన్నికలకు వెళ్లాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. వైసీపీ ముందుకు రాలేదంటే వారికి ప్రజల మద్దతు లేనట్లేనని చంద్రబాబు ట్వీట్ చేశారు.

Tags:    

Similar News