బాబు కోపంతో ఊగిపోయారు

ఉల్లిపాయలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు నిజనిర్థారణ కమిటీకి సిద్దమవుతారా? [more]

Update: 2019-12-10 07:49 GMT

ఉల్లిపాయలపై ఏపీ అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహంతో ఊగిపోయారు. తనపై అనవసర ఆరోపణలు చేస్తున్న వైసీపీ నాయకులు నిజనిర్థారణ కమిటీకి సిద్దమవుతారా? అని చంద్రబాబు సవాల్ విసిరారు. తనకు హెరిటేజ్ ఫుడ్స్ ఉందని తప్పుడు ఆరోపణలు చేశారని, అది నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని, నిరూపించకుంటే జగన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రికి తాను సవాల్ విసురుతున్నానని అన్నారు. ఈ ముఖ్యమంత్రికి పదవిలో క్షణం కూడా ఉండే అర్హత లేదన్నారు చంద్రబాబు. హెరిటేజ్ మాదని నిరూపిస్తే రాజీనామా చేస్తానని అన్నారు.

Tags:    

Similar News