జగన్ కు చేతకాకనే

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన పార్టీ వ్యూహకర్తల సమావేశంలో మాట్లాడారు. పోలవరం పనులను [more]

Update: 2019-07-16 03:45 GMT

తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసుకుని సభా సమయాన్ని వృధా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఆరోపించారు. ఆయన పార్టీ వ్యూహకర్తల సమావేశంలో మాట్లాడారు. పోలవరం పనులను గత ప్రభుత్వాలు 5 శాతం పూర్తి చేస్తే ఈ ఐదేళ్లలో తాము 66 శాతం పూర్తి చేశామన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం చేతకాక టీడీపీపై విమర్శలు చేస్తుందన్నారు. పోలవరం ప్రాజెక్టు నుంచి మెషనరీని కూడా తరలించారన్నారు. కూలీలు ఉపాధి కోల్పోయారన్నారు. అవినీతి ఆరోపణలతో సభా సమయాన్ని వృధా చేస్తున్నారన్నారు చంద్రబాబునాయుడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో తనపై 26 ఆరోపణలు చేశారని, ఏ ఒక్కటీ నిరూపించలేకపోయారన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరించలేకనే టీడీపీపై విమర్శలు చేస్తున్నారన్నారు.

Tags:    

Similar News