రాజధానిని మార్చాలన్న కుట్ర

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చాలన్న కుట్ర జరుగుతందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఇప్పటికే నిలిపివేశారన్నారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు [more]

Update: 2019-08-20 14:30 GMT

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని మార్చాలన్న కుట్ర జరుగుతందని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులను ఇప్పటికే నిలిపివేశారన్నారు. అమరావతి నిర్మాణం కోసం రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారన్న విషయం గుర్తుంచుకోవాలన్నారు. బొత్స సత్యనారాయణ అమరావతి విషయంలో దారుణంగా, దుర్మార్గంగా మాట్లాడారని చంద్రబాుబ అన్నారు. వరదల పేరు చెప్పి అమరావతిని మార్చాలని చూస్తే తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనక తప్పదని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ ప్రభుత్వం కుట్రలు, కుతంత్రాలను ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికే పోలవరం, అమరావతి పనులను ఆపేశారన్నారు. అమరావతిపై తాను ఎంతవరకైనా పోరాడాతానని చంద్రబాబు స్పష్టం చేశారు.

Tags:    

Similar News