ట్రంప్ విందుకు జగన్.. ట్రోల్ అవుతున్న బాబు కామెంట్స్

జగన్ మీద చంద్రబాబు అక్కసు ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఇచ్చే విందులో దేశ వ్యాప్తంగా ఎనిమిది మంది ముఖ్యమంత్రులను మాత్రమే [more]

Update: 2020-02-26 03:02 GMT

జగన్ మీద చంద్రబాబు అక్కసు ఏమాత్రం తగ్గడం లేదు. రాష్ట్రపతి భవన్ లో ట్రంప్ కు ఇచ్చే విందులో దేశ వ్యాప్తంగా ఎనిమిది మంది ముఖ్యమంత్రులను మాత్రమే ఆహ్వానించారు. మిగిలిన వారిని పిిలవలేదు. అందులో అరవింద్ కేజ్రీవాల్ సయితం ఉన్నారు. కానీ జగన్ ను ట్రంప్ విందుకు పిలవంది మాత్రం ఆయనపై ఉన్న కేసులే కారణమంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్ మీద అనేక క్రిమినల్ కేసులున్నాయని, అందుకే ట్రంప్ విందుకు జగన్ కు పిలుపు రాలేదని చంద్రబాబు అన్నారు. అమెరికా చట్టాలు కఠినంగా ఉంటాయని, ఆర్థిక నేరగాళ్లను వారు దూరం పెడతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. జగన్ ను ట్రంప్ విందుకు ఆహ్వానించకపోవడంపై బాబు వ్యాఖ్యలు ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి.

Tags:    

Similar News