టీడీపీ మాజీ మంత్రి మెడకు హత్య కేసు

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కేసు నమోదయింది. వైసీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర [more]

Update: 2020-07-03 04:33 GMT

తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పై కేసు నమోదయింది. వైసీపీ నాయకుడు మోకా భాస్కర్ రావు హత్య కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని పోలీసు దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. పేర్ని నాని ముఖ్య అనుచరుడు అయిన భాస్కర్ రావు ఇటీవల హత్యకు గురయిన సంగతి తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిచ్చిన సమాచారం ప్రకారం కొల్లు రవీంద్ర ప్రమేయం ఉందని తేలడంతో ఆయనపై కేసు నమోదు చేసిినట్లు తెలిసింది.

Tags:    

Similar News