జగన్ తో తొలిసారి రాజధాని రైతులు

ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసానికి రాజధాని రైతులు చేరుకున్నారు. మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో కలసి రాజధాని [more]

Update: 2020-02-04 11:39 GMT

ఏపీ ముఖ్యమంత్రి వైెస్ జగన్ ను తాడేపల్లిలోని ఆయన నివాసానికి రాజధాని రైతులు చేరుకున్నారు. మంగళగిరి, తాడికొండ ఎమ్మెల్యేలు ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలతో కలసి రాజధాని రైతులు క్యాంప్ కార్యాలయంలో కలుసుకున్నారు. పదిహేను నిమిషాలు పాటు ముఖ్యమంత్రి జగన్ కు రాజధాని రైతులు తమ సమస్యలు వివరించారు. తొలిసారి ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో రాజధాని ప్రాంత రైతులు భేటీ అయ్యారు. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని గత 45 రోజులుగా రాజధాని ప్రాంత గ్రామాల్లో రైతులు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. రైతులు, అమరావతి జేఏసీ నేతలు ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దలను కూడా కలుస్తున్నారు. రాజధాని రైతులు జగన్ ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.

Tags:    

Similar News