బుగ్గనను అలా తోసేశారేంటి?

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని తిరుపతి విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండురోజుల క్రితం కేంద్ర మంత్రి [more]

Update: 2021-06-14 03:52 GMT

రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డిని తిరుపతి విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. దీనిపై ఆయన ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండురోజుల క్రితం కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తిరుమల పర్యటనకు వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు ఆర్థఇక మంత్రి బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి రేణిగుంట విమానాశ్రాయనికి వచ్చారు. అప్పుడు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. అయితే పియూష్ గోయల్ తిరిగి వెళ్లే సమయంలో వీడ్కోలు చెప్పేందుకు బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఎయిర్ పోర్టుకు రాగా ఆయనను భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. ఆయనను తోసివేయడంతో కింద పడిపోయేంత పరిస్థితి ఏర్పడింది. దీనిపై బుగ్గన రాజేంద్ర నాధ్ రెడ్డి ఎయిర్ పోర్టు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.

Tags:    

Similar News