తెలంగాణలో మరో దిశ తరహా సంఘటన

హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరోక దారుణం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తుంగ పల్లి గ్రామ సమీపంలోని ఒక బ్రిడ్జి దగ్గర మహిళను దారుణంగా హత్య [more]

Update: 2020-03-17 06:34 GMT

హైదరాబాద్ శివారు ప్రాంతంలో మరోక దారుణం వెలుగుచూసింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలం తుంగ పల్లి గ్రామ సమీపంలోని ఒక బ్రిడ్జి దగ్గర మహిళను దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ మహిళ వయస్సు 28 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. మహిళపై అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు ప్రస్తుతానికి అనుమానిస్తున్నారు. ఈ దిశలోనే పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఇవాళ ఉదయం తెల్లవారుజామున మహిళ మృతదేహాన్ని అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే చనిపోయిన మహిళ ఉన్నత కుటుంబానికి చెందిన వారై ఉంటారని పోలీసులకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ మహిళకు సంబంధించిన ఆనవాళ్లను బట్టి ఎవరు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు. మహిళను హత్య చేసిన తర్వాత తలపై బండరాయితో మోది చంపారు ఈ మహిళ ఎవరనేది ప్రస్తుతానికి గుర్తుపట్టడం కష్టంగా మారింది. మహిళకు సంబంధించిన పూర్తి వివరాల కోసం అధికారులు ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నారు.

Tags:    

Similar News