బాబు పై బైరెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి రాజధాని ప్రజారాజధాని కాదని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తనకు, తన [more]

Update: 2019-12-26 07:25 GMT

టీడీపీ అధినేత చంద్రబాబుపై బీజేపీ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. అమరావతి రాజధాని ప్రజారాజధాని కాదని బైరెడ్డి అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తనకు, తన అనుచరులకు లబ్డి చేకూర్చడం కోసమే అమరావతిని రాజధానిగా చేశారన్నారు. జగన్ దానికి వంత పాడటం వల్లనే రాయలసీమ తీవ్రంగా నష్టపోయిందని బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్నారు. రాయలసీమలోనే ఎగ్జిక్యూటివ్ రాజధానిగా ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రెండు కులాల మధ్య ఘర్షణే రాజధాని అమరావతి అని ఆయన పేర్కొన్నారు. రాజధానిని రియల్ ఎస్టేట్ గా మార్చారని బైరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News