ఎప్పుడైనా ఒంటరిగానే పోటీ

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేనకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ఇక్కడ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ [more]

Update: 2021-04-02 00:45 GMT

తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ జనసేనకు స్పష్టమైన సంకేతాలను ఇచ్చారు. ఇక్కడ ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేస్తుందని తెలిపారు. టీఆర్ఎస్ తో పొత్తు ఉంటుందన్న తప్పుడు ప్రచారం జరుగుతుందని, దానిని నమ్మవద్దని బండిసంజయ్ తెలిపారు. అలాగే జనసేన కూడా ఏపీలో పొత్తు ఉందని ఇక్కడ కూడా తమతో కలిసేందుకు ప్రయత్నించవద్దని పరోక్షంగా సందేశమిచ్చినట్లయింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం ఖాయమని బండి సంజయ్ తెలిపారు.

Tags:    

Similar News