టీడీపీవి చీప్ పాలిటిక్స్

తెలుగుదేశం పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన [more]

Update: 2021-08-16 07:00 GMT

తెలుగుదేశం పార్టీ చీప్ పాలిటిక్స్ చేస్తుందని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని ఆయన ఆరోపించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ సుంకేశుల ప్రాజెక్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేశుల ప్రాజెక్టుకు సంబంధించి ఎలాంటి పెండింగ్ పనులు లేవన్నారు. పులిచింతల విషయంలో కూడా ఇలాగే టీడీపీ వ్యవహరించిందన్నారు. పులిచింతల గేట్లు ఎప్పుడు కట్టారన్న అవగాహన లేకుండా విమర్శలు చేసిందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. సిబ్బంది కొరత ఉందని టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తుందని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.

Tags:    

Similar News